ఇంటర్ ప్రైవేట్ అభ్యర్థులు తత్కాల్ పథకం కింద ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్బోర్డు కార్యదర్శి ఎస్.వి.శేషగిరిబాబు సోమవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. తత్కాల్ కింద రూ.1300, అటెండెన్స్ మినహాయింపు ఫీజు రూ.1300, మొదటి ఏడాది పరీక్ష ఫీజు రూ.500, రెండో ఏడాది పరీక్ష ఫీజు రూ.500లు ఉంటుందన్నారు. ఫీజులకు సంబంధించిన చలానాలను ఫిబ్రవరి 2లోపు ఆన్లైన్లో తీయాలని, నాలుగో తేదీలోగా ఆర్ఐవో కార్యాలయాల్లో సమర్పించాలని పేర్కొన్నారు.